భర్తను హత్య చేసిన భార్య…


హర్యానా రేవరీ జిల్లాలోని జద్థాల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు మోనును అతని భార్య తన్ను మరియు ఆమె ప్రియుడు సోను సహా ఇతరులు కుట్ర చేసి హత్య చేశారు.

జూన్ 8న మోను జీతం తీసుకొని భార్యను తీసుకురావడానికి వెళ్తుండగా, తన్ను అతన్ని కలవమని పిలిచింది.
తన్ను, సోను, హరియోమ్, అమన్ అనే నలుగురు కలిసి మోనును అదుపులోకి తీసుకొని నోటి మీద చేతులు పెట్టి ఊపిరాడకుండా చేశారు అతను స్పృహ కోల్పోయాక బతికి అందగానే కాల్వలోకి విసిరేశారు. ఇది ప్రమాదవశాత్తుగ మునిగి చనిపోయినట్లు (accidental drowning) కనిపించేలా చేయడానికి.
అతని స్కూటర్‌ను కాల్వ దగ్గర పార్క్ చేసి సూసైడ్ లాగా నమ్మించారు

జూన్ 10న మోను శవం కాల్వలో దొరికింది. పోస్ట్‌మార్టం‌లో గాయాలు కనిపించకపోవడంతో పోలీసులు ప్రమాదం/సూసైడ్‌గా నమోదు చేసి శవాన్ని కుటుంబానికి అప్పగించారు.
తన్ను అంత్యక్రియలకు వచ్చి ఏడ్చి, ఆచారాలు చేసి దుఃఖిస్తున్నట్లు నటించింది.
మోను ఫోన్‌లో డిలీట్ చేసిన చాట్స్, కాల్ రికార్డులు జూన్ 8న 49 కాల్స్ కుటుంబం సైబర్ ఎక్స్‌పర్ట్స్ సాయంతో రికవర్ చేసి పోలీసులకు అందజేసింది. ఇవి హత్య కుట్రను బయటపెట్టాయి

తన్ను మరియు హరియోమ్‌ను అరెస్టు చేశారు.
ముఖ్య నిందితుడు సోను మరియు అమన్ ఇంకా పరారీలో ఉన్నారు.
పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు డిలీట్ చేసిన చాట్స్ ద్వారా బయటపడటం హైలైట్. మోను కుటుంబం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఆశ్రయించి చర్యలు తీసుకోవడంతో కేసు ముందుకు వచ్చింది.

ఎందుకు వీళ్ళు రాను రాను ఇంత క్రూరంగా తయారవుతున్నారు

About The Author