పోక్సో కేసు లో ముద్దాయి కి జీవించినంత కాలం కఠిన కారా గార జైలుశిక్ష
తిరుపతి జిల్లా,2026 ,జూలై 10,వడమాలపేట,పేపోక్సో కేసు లో పాములా నాగరాజ్ ప్రస్తుత వయషు 25 సం అనే ముద్దాయి కి జీవించినంత కాలం కఠిన కారా గార జైలుశిక్ష . 10 వేలు రూపాయలు జరిమానా.
కేసు వివరములు .
01.11.2024 నసాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వడమాల పేట మండలం AM పురం యానాది కాలనీ లో తన ఇంటి ముందు ఆడుకుంటున్న 3 1/2 సంవత్సరములు వయషు కలిగిన మైనర్ బాలికను ఎదురు ఇంటిలో యుండిన 23 వయషు యుండిన పాముల నాగరాజు కామం తో ఎవరు బాలిక దగ్గర లేని సమయం చూసి తన దగ్గరకి వెళ్లి తనకు తిను బండారాలు తీసి ఇస్తాను అని నమ్మించి తనతో పాటు ఒక చిల్లర కొట్టుకు తీసుకువెళ్లి కుర్కురే , బిస్కట్ పాకెట్ తీసి ఇచ్చి సచివాలయం భవనం సమీపంలోని నిర్మానుష్య జాగా లోకి తీసుకువెళ్లి తన పై బలవంతంగా పలుమార్లు అత్యాచారం చేసి తను బ్రతికియుంటే తన నేరం బయటపడుతుందని ఆ మైనర్ బాలికను గొంతు నులిమి దారుణం గా చంపి మృత దేహం ను అక్కడే వదిలేసి పారిపోయినాడు .తన మైనర్ కూతురు కనపడకపోవడంతో తన తల్లి ఆరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో వడమాలపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు వెంటనే బాలిక మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసి పుత్తూరు DSP శ్రీ రవి కుమార్ గారు దర్యాప్తు చేసి ముద్దాయి సదరు నేరం చేసినట్లు గా నిర్ధారించి చిత్తూరు పోక్సో కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు .
చిత్తూరు పోక్సో కోర్టు లో కేసు విచారణ పూర్తి అయి ముద్దాయి పై నేరం రుజువు కాగా గౌరవ పోక్సో కోర్ట్ కు ఇంచార్జి గా జడ్జి గా యున్న గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి అరుణ సారిక గారు ఈ రోజు 20-07-2026 న తీర్పు చెప్పి ముద్దాయి పాముల నాగరాజు @ సుశాంత్ కు యావజ్జీవ జైలు శిక్ష అనగా తాను జీవించినంత కాలం వరకు కఠిన కారాగార జైలు శిక్ష , మొత్తం 10 వేలు రూపాయలు జరిమానా విధించారు .
బాధితురాలి కుటుంభం కు 10 లక్ష లు రూపాయలు నష్ట పరిహారం ప్రభుత్వం తరపున చెల్లించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు .
ఈ కేసు లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి V మోహనకుమారి ప్రాసిక్యూషన్ తరపున కేసును వాదించారు .
కోర్టు లైసన్ ఆఫీసర్ శ్రీ. గిరీష్ బాబు
వడమాల పేట పోలీసు స్టేషన్ కోర్ట్ హెడ్ కానిస్టేబిల్ లు శ్రీ రమణరాజు సాక్షులను కోర్టు లో హాజరు పరిచారు .
…శ్రీమతి వి . మోహన కుమారి ,
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,
పోక్సో కోర్టు ,చిత్తూరు .
