తిరుమలలో చోరీ కేసును ఛేదించిన తిరుమల టు టౌన్ పోలీసులు

తిరుపతి,2026 జూలై,10,తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 59/2026 (U/s 305(a), 331(4) BNS) కేసును పోలీసులు వేగంగా ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి రూ.60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే 06-07-2026 తేదీన జార్ఖండ్ కు చెందిన ఒక భక్తుడు తన కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారి దర్శనార్థమై వచ్చి తిరుమలలోని ANC రూమ్ నెం.414-Eలో బస చేసి రూమ్ లాక్ చేసి శ్రీవారి దర్శనానికి వెళ్లడం జరిగింది తిరిగి వచ్చే లోపు గుర్తుతెలియని వ్యక్తులు కిటికీ ద్వారా ప్రవేశించి సుమారు రూ.95,000 నగదు చోరీ చేసినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమల లో ఫిర్యాదు చేయడం జరిగింది,

రాజశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ద్వారా ముద్దాయిని గుర్తించి తేదీ 09-07-2026 సాయంత్రం తిరుమలలో అరెస్ట్ చేయడం జరిగింది,

నిందితుడు ఉప్పు గోవర్ధన్ (25), తిరుపతి రూరల్ మండలానికి చెందినవాడు. నిందితుడు గత రెండు నెలల క్రితం తిరుమలలో శానిటేషన్ వర్కర్ గా విధులు నిర్వహిస్తూ ఉండి ఈ చర్యకు పాల్పడ్డాడు, ఇతడు గతంలో కూడా పలు దొంగతనం కేసులలో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్నాడు,

నిందితుడి వద్ద నుండి రూ.60,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచదమైనది,

శ్రీవారి భక్తులకు తిరుపతి జిల్లా పోలీసుల విజ్ఞప్తి:

శ్రీవారి భక్తులు తాము తీసుకున్న వసతి గదుల నందు విలువైన వస్తువులు ఉంచి వెళ్ళవద్దని, గదులు, విడిచి వెళ్లే సమయంలో తలుపులు, కిటికీలు సక్రమంగా లాక్ చేసి వెళ్ళవలెను, విలువైన నగదు, ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది,

అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవ 112కు సమాచారం అందించాలని కోరడమైనది,

About The Author