శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యపై త్వరలో సానుకూల నిర్ణయం

690వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షరెం
తిరుపతి జిల్లా,2026, జూలై 11, రెండేళ్లుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్షలు చేపట్టిన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలపై సానుకూల నిర్ణయం త్వరలో తీసుకుంటామని, శాశ్వత పరిష్కారాన్ని కల్పిస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రకటించారు.
శనివారం నాటి ఉదయం 10:30 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన దీక్షలు కొనసాగిస్తున్న శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే నాని చేరుకున్నారు. పాతిక సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు ప్రాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనోపాధి లేకుండా చేయటం సమంజసం కాదని, తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ శ్రీవారి మెట్టు వ్యాపారులు 690 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న విషయం ప్రజలకు విదితమే.
రెండేళ్లుగా పట్టు వీడకుండా 30 కుటుంబాల చిరు వ్యాపారులు చేపట్టిన ఈ ఉద్యమానికి పలు రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చంద్రగిరి ఎమ్మెల్యే నాని చొరవ చూపి తన నియోజకవర్గ పరిధిలోని శ్రీవారి మెట్టు సమస్యను పరిష్కరించాలని అధికారులతో చర్చించారు.
ఈ మేరకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తో ఎమ్మెల్యే మాట్లాడి శనివారం నాటి ఉదయం నేరుగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి చిరు వ్యాపారులతో చర్చించారు. న్యాయమైన ఈ సమస్య పరిష్కరించటంలో ఆలస్యానికి చింతిస్తున్నట్టు ప్రకటించారు.సోమవారం నాడు ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలలో సిఐటియు నేతలు, తాను పాల్గొంటామని శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు ఎస్ జయచంద్ర, వేణుగోపాల్, బుజ్జి, నరేంద్ర చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్షులు చిట్టిబాబు, యుగంధర్, గణేష్, పెంచలయ్య, రామ్మూర్తి, చిరంజీవి, ప్రకాష్, గోపి, మల్లికార్జున్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ జయచంద్ర,జిల్లా అధ్యక్షులు,సిఐటియు, తిరుపతి.
