విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి!

దగా DSCపై ప్రజా పోరాటం – రెండవ రోజు

తిరుపతి,2026, ఆగస్ట్, 07,DSC–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట నేడు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి గారి నాయకత్వంలో, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ భూమన అభినయ్‌రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.

ఈ దీక్షకు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు సంఘీభావం తెలియజేస్తూ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు.

ఈ దీక్షలో మాజీ మేయర్ డాక్టర్ శిరీష గారు, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

ఈ రిలే నిరాహార దీక్షలు ఆగస్టు 9 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.

నిజాయితీగా చదివిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు!

DSC అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి!

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి!

About The Author