కార్పొరేషన్ మెయిన్ పార్కులో లంకిశెట్టి సిమెంట్ బెంచీలు వితరణ…..


కార్పొరేషన్ మెయిన్ పార్కులో లంకిశెట్టి సిమెంట్ బెంచీలు వితరణ…..

మచిలీపట్నం మున్సిపల్ పార్క్ అభివృద్ధిలో నగర ప్రజలందరూ సహకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాదు పిలుపునిచ్చారు. గురువారం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దివంగత విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు లంకిశెట్టి పాండురంగారావు మరియు లంకిశెట్టి దుర్గా వెంకటసాయి ప్రసాద్ జ్ఞాపకార్థం సిమెంట్ బెంచ్ లను వారి కుమారుడు లంకిశెట్టి రామకృష్ణ మున్సిపల్ పార్కుకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, నగర జనసేన పార్టీ అధ్యక్షులు గడ్డం రాజు మాట్లాడుతూ దివంగత తల్లిదండ్రుల పేరుమీద పిల్లల చేసే సేవా కార్యక్రమం దైవ కార్యక్రమతో సమానమని అన్నారు. సిమెంట్ పెంచి లేపార్టు పార్కు వచ్చే వాకర్లకి వృద్ధులకు సందర్శలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, లంకిశెట్టి రామకృష్ణ, మున్సిపల్ పార్క్ సూపర్వైజర్, కార్పొరేషన్ బాలికల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు

About The Author