భార్య ప్రియుడితోకలిసి భర్త ను చంపేసింది…

అతడో అమాయక భర్త …
భార్య అక్రమ సంబంధం పై బంధువులు , పోలీసుల వద్ద మోర పెట్టుకునేవాడు..
భార్య ప్రియుడు తనపై దాడిచేసినా పోలీసులవద్దకుపోతే పట్టించుకోలేదు..
చివరకు … భార్య ప్రియుడితోకలిసి అతడిని దారుణంగా చంపేసింది..
తన పిల్లల ముందే ప్రియుడితో భర్తను చంపించింది.. తల్లి కిరాతకాన్ని పిల్లలే చెప్పేశారు..
జూలూరుపాడుకు చెందిన షేక్‌ హమీదాను ఏడేళ్ల క్రితం వైరాకు చెందిన అబ్దుల్లా (27) ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షేక్‌ అక్బర్‌ (21)తో అబ్దుల్లా భార్య హమీదాకు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన అబ్దుల్లా మందలించాడు. అయినా వినకుండా అక్బర్‌తో తరుచూ ఫోన్‌ మాట్లాడుతుండటంతో పలుమార్లు హెచ్చరించాడు. తాను బయటకు వెళ్లిన సమయంలో తన ఇంటికి అక్బర్‌ వస్తున్నట్లు అబ్దుల్లా గుర్తించాడు. ఒకట్రెండు సార్లు అతడు దొంగచాటున ఇంట్లోంచి పారిపోయిన సందర్భాలను గమనించాడు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అబ్దుల్లాను చంపేందుకు భార్య హమీదా, ప్రియుడు అక్బర్‌ పథకం పన్నారు. గురువారం అర్ధరాత్రి ఇంట్లో అబ్దుల్లా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అక్బర్‌ అక్కడకు చేరుకున్నాడు. అబ్దుల్లా మెడను పట్టుకున్న అక్బర్‌ గట్టిగా అదిమి ఊపిరి ఆడకుండా చేశాడు. ఆ సమయంలో అబ్దుల్లా కాళ్లను కదపకుండా భార్య హమీదా గట్టిగా పట్టుకుంది. పథకం ప్రకారం హత్య చేశారు. అక్బర్‌ అక్కడ్నుంచి వెళ్లిపోగా.. కొద్దిసేపటి తర్వాత తన భర్త మూర్ఛ కారణంగా చనిపోయినట్లు ఇరుగుపొరుగు, బంధువులను నమ్మించేందుకు హమీదా ప్రయత్నం చేసింది. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీఐ రమాకాంత్‌, ఎస్సై నరేశ్‌ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లా మృతిపై అనుమానాలు ఉండటంతో లోతుగా విచారించారు. భార్యను, అక్బర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. అబ్దుల్లా కుమార్తె అయిన నాలుగేళ్ల సమీరా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చి ఆశ్చర్యపరిచింది. తన తండ్రి గొంతును గట్టిగా పట్టుకుని అక్బర్‌ అంకులే చంపాడంటూ ఆ చిన్నారి తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో అబ్దుల్లా కుమార్తెలు మేల్కొని ఉన్నట్లు గుర్తించారు.

About The Author