ఘనంగా రాయల్ పార్క్ హోటల్ ప్రారంభం

న్యూస్ ఫోర్స్, నెల్లూరు: నగరంలోని మద్రాస్ బస్టాండ్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన హోటల్ రాయల్ పార్క్ ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఈసందర్భంగారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన రావుల శ్రీనివాసులు గౌడ్ అత్యాధునిక వసతులతో నెల్లూరు నడిబొడ్డున హోటల్ అందుబాటులోకి తేవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరులో స్టార్ హోటళ్లకు దీటుగా ఉన్న రాయల్ పార్క్ విజయవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర మెడికల్ అభివృద్ధి ఛైర్మన్ శివ ప్రసాద్, రాష్ట్ర హోటళ్ల సంఘం ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణా రెడ్డి,రంగనాధ స్వామి దేవస్థాన ఛైర్మన్ కోట గురుబ్రహ్మం తదితరులువ్యాపారస్తులు,రాయల్ పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీన్యూస్, నెల్లూరు సిటీ.

About The Author