జూన్ 3కి వాయిదా పడ్డ టీవీ9 షేర్ల వివాదం కేసు…

టీవీ9 షేర్ల వివాదం కేసు జూన్ 3కి వాయిదా పడింది. ఇటీవలే టీవీ9 షేర్లను మైహోమ్ రామేశ్వర రావు, మెఘా కృష్ణా రెడ్డి కొనుగోలు చేశారు. గతంలో టీవీ9లో హీరో శివాజీ 40,000 షేర్లు కొనుగోలు చేశారు. వాటాదారునైన తన అనుమతి లేకుండా టీవీ9 షేర్ల అమ్మకం, కొనుగోళ్ళు ఎలా జరుపుతారని ప్రశ్నిస్తూ హీరో శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈరోజు వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.

About The Author