పోలీసులకు తలనొప్పిగా మారిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ప్రేమ వ్యవహారం..

ఆ తండ్రిని చూడండి.. రక్తాన్ని చెమటగా మార్చి కూలి పనులు చేసి బిడ్డను చదివిస్తే , ఆ బిడ్డ తండ్రిని కాలదన్నింది. చదువు అయిపోయాక ప్రియుడేకావాలని , తండ్రిని వద్దన్నది.. ఆ తండ్రి వేషంచూడండి.. ముతక పంచె , పైన కండువా .. పాపం కన్నబిడ్డ మాటల కత్తితో కడుపులో పొడిచినా తండ్రి ఆవేదన బిడ్డ కోసమే , బిడ్డ తపన ప్రియుడి కోసమే… కన్న ప్రేమ అంటేనే విరక్తి కలిగే హృదయవిదారక సన్నివేశమిది ..
‘నేను నా తండ్రితో పాటు ఇంటికెళ్లను.. నాకు వేరే పెళ్లి చేస్తారు. నేను ప్రేమించిన యువకుడి దగ్గరికే వెళ్తా.. ’ అంటూ నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థిని మొండికేసింది. ట్రిపుల్‌ ఐటీకి సెలవులు కావడంతో కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి వెంట తాను వెళ్లేది లేదని భీష్మించుకూర్చుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోక ట్రిపుల్‌ ఐటీ అధికారులు తలలు పట్టుకున్నారు.
ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం పూర్తిచేసిన పి.జ్యోత్స్న స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్లటూరు. ఏడాది కిందట ఇంటర్న్‌షిప్‌నకు వెళ్లిన సమయంలో విజయవాడలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మోహనమురళీతో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అతను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు కుమార్తెను మందలించారు కూడా. ఈ నేపథ్యంలో శనివారంతో పరీక్షలు పూర్తవుతున్నందున కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి శుక్రవారం సాయంత్రమే ట్రిపుల్‌ ఐటీకి వచ్చాడు.
ట్రిపుల్‌ ఐటీ అధికారులు కూడా ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నూజివీడు సీఐ మిద్దే గీతారామకృష్ణ సైతం వెళ్లి ఆ అమ్మాయికి కౌన్సెలింగ్‌ చేసినా తండ్రి వెంట వెళ్లేందుకు ససేమిరా అనడంతో ఏమి చేయాలో తెలియనిస్థితిలో ఉన్నారు.

About The Author