సుమో-ఆటో ఢీ…వ్యక్తి మృతి…

సుమో-ఆటో ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయలైన సంఘటన పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం, నండింపల్లికు చెందిన వెంకటేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.ఈ నేపథ్యంలో నండింపల్లి నుంచి చంద్రగిరికి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరాడు.అగరాల వద్దనున్న పాలిటెక్నిక్ కళాశాల సమీపంకు చేరుకోగానే తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న సుమో వేగంగా వచ్చి ఢీకొంది.ఈ ఘటనలో వెంకటేష్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో వెంకటేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామన్నారు.

About The Author