ట్రాక్టర్ క్రింద పడి నవవధువు మృతి…


అర్ధవీడు మండలం మోహిద్దీన్ పురం కు చెందిన సయ్యద్ ఇబ్రహీం (24) గత 15 రోజుల కిందట బేస్తవారిపేట కు చెందిన షేక్ రషీద (20) ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇబ్రహీం CRPF కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల నిమిత్తం తన సొంత ఊరు అయిన మోహిద్దీన్ పురం కు వచ్చి సరదాగా ఇవాళ సెలవుదినం (ఆదివారం) కావడంతో భార్య తో కలిసి అత్తారింటికి బయలు దేరారు. అయితే నాగులవరం సమీపంకు రాగానే మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబలించింది. కంభంకు వస్తున్న కర్రల లోడ్ తో ఉన్న ట్రాక్టర్ ను క్రాస్ చేయబోగా ప్రమాదవశాత్తు తన భార్య భయంతో బైకు నుండి దిగడంతో ట్రాక్టర్ ఇంజిన్ టైర్ తగిలి వెనక ఉన్న ట్రాలీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న బంధువులు కన్నీరు మున్నీరు ఐయ్యారు.. నవవధువు కావడంతో బంధులంతా ధ్రిక్భ్రాంతికి లోనయ్యారు. సంఘటన స్థలం మృతి చెందిన రషీద ను పోస్ట్ మార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…కేసు నమోదు చేసుకున్న అర్దవీడు ఎస్సై దర్యాప్తు చేపట్టారు._

About The Author