నవాబు పేట వద్ద ప్రైవేటు బస్సు బస్సు బోల్తా …


కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట వద్ద ప్రైవేటు బస్సు బస్సు బోల్తా ……

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట వద్ద రమణ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన ఘటనలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా. వీరిలో 30 మందికి తీవ్రగాయాలు కాగా. గాయాలైన పాలైన వారిలో 10 మంది చిన్నారులు కలరు. వీరందరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వం హాస్పటల్ కు తరలించారు .తరలించిన వారిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.అంతేకాకుండా సంఘటన స్థలంలో బస్సు డ్రైవరు క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.ఇరుక్కున్న వ్యక్తి ని బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ యానం నుండి హైదరాబాద్ వెళుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే కారణమంటూ ప్రయాణికులు చెబుతున్నారు. అప్పటికి డ్రైవర్ కు ఎన్ని సార్లు హెచ్చరించిన వారు చెప్పిన మాటలు లెక్కచేయకుండా బస్సు అతివేగం అడగడంతో. ఈ ప్రమాదం చోటు చేసుకుంది ..ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా వారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు .ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకొంటున్నారు

About The Author