ఆర్టీసీ యాజమాన్యంతో… కార్మిక సంఘాల చర్చలు విఫలం…


* సమ్మె వివమించుకోవాలని ఎండీ విజ్ఙప్తి…
* ఇప్పటికే ఆలస్యం అయ్యింది కుదరదన్న నేతలు

సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల పరుష్కారం కోసం ఇటీవల కార్మిక సంఘాలు సమ్మె నోటీసును ఇచ్చిన విషయం తెలిసిందే…

అయితే బుధవారం సాయంత్రం ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి సురేంద్ర బాబు IPS, కార్మిక సంఘ నేతలతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. సుదీర్ఘంగా, పొద్దుపోయే వరకు జరిగిన ఈ చర్చల్లో.. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించలేమని, ప్రభుత్వం నుంచి నిధులు రాగానే వేతన సవరణ బకాయిలు చెల్లిస్తామని,అప్పటి వరకు సమ్మె యోచన విరమించుకోవాలంటూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు చేసిన విజ్ఙప్తిని, ఏపీఎస్సార్టీసీ కార్మిక సంఘాల ఐకాస సహా ఎంప్లాయీస్ యూనియన్ తోసిపుచ్చింది. సంస్థకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించలేమని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు స్పష్టం చేశారు.

ఎండీ విజ్ఞప్తిపై ఐకాస నేతలు స్పందిస్తూ… తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున ఆందోళన విరమించబోమని స్పష్టం చేశాయి. వేతన సవరణ బకాయిలు సహా 27 డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదని అన్నారు. సత్వరం తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగుతామని, రేపు ఉదయం పదకొండు గంటలకు సమావేశమై సమ్మె తేదీ ప్రకటిస్తామని ఐకాస నేత దామోదర్ పేర్కొన్నారు.

About The Author