ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో వివరించిన నిధుల రహస్యాలు –


ప్రియమితృలకు నమస్కారం ,
నిధి అనగానే చాలమంది బంగారం , వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. అంతకంటే విలువయిన సంపద అనగా వైద్యానికి , మంత్రశాస్త్రానికి మరియు తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగిరేకులు పైన చెక్కినటువంటి ఎంతో విలువైన విషయాలు కొన్నికొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో దాచబడి ఉన్నాయి. అవి వెలికి తీసి అందులో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు . ధనం ను కూడా భూగర్భం నందు దాచిన దానిని కూడా నిధి అంటారు.
నిధులు అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా దాచబడి ఉంటాయి. అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే జనం దాచుకున్న సోమ్ము . ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో , పొలాల్లో తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలలో పెట్టి దాచేవారు . అదే సమయంలొ అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేవి . మొత్తం వూరిలో శవాన్ని తీయుటకు మనుషుల కూడా లేకుండా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా మరణించుటకు కారణం అయ్యే వ్యాధి పేరు “కలరా” అవి అలా ఉండిపోయి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.
ఇక మనం రెండోవరకం నిధుల గురించి తెలుసుకుందాం . ఈ నిధులు గజదొంగలు వూర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి . ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతం అయిపోతుంది.
మూడో రకం నిధుల గురించి చెప్పలంటే వీటిని రాజ నిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశ
పూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర,యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు . ఈ పూజకొరకు చాలా శక్తిమంతం గా ఉండే అస్ఖలిత బ్రహ్మచారులు ను ఉపయోగిస్తారు . ఎక్కువుగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మనదేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు రాజులు ఈ పద్దతి పాటిస్తారు. ఈ పద్దతిలో రాజు ఎక్కడో ఒకచోట ఈ నిధి గురించిన రహస్యాన్ని పేర్కొంటాడు . అటువంటి కొన్ని మ్యాప్స్ నేను పరిశీలించాను .
ఈ శక్తిమంతం అయిన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక , తాంత్రిక వేత్తలు 4 రకాలుగా వర్గీకరించారు వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్దుడు రచించిన “నిధిప్రదీపం” అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశాడు . ఈ బుక్ సంస్కృతంలో 1930 లో ముద్రించబడినది.
శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి 4 రకాలు . అవి
* కచ్చప .
* మకర .
* శంఖ .
* పద్మ .
వీటిలో కచ్చప , మకర నిధులు మాత్రమే స్థిరంగా , అచంచలంగా ఒకేచోట ఉండును. వీటిని ప్రయత్నముచేత , శివానుగ్రహము చేత మాత్రమే పొందగలరు .
మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్లిపోవును .వీటిని సాధించుట అసంభవం . శివ, విష్ణు , అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యం అగును.
నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు –
* ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను .
* డేగలు , కాకులు , కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువ గా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును.
* కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును.
* ఒక ప్రదేశం నందు అనేక వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నియు కలిసి నివసించుచుండిన ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను .
* పురాతన దేవాలయాల యందు , పాడైపోయిన చెరువుల యందు , పాడిపడిన గ్రామాల యందు నిధి ఉండును.
ప్రతినిత్యం పశువులు మేస్తున్ననూ తెల్లవారే సరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదెశం నందు గడ్డి తొందరగా పెరుగును .
ఆకురాలు సమయంలో మిగిలిన చెట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు క్రింద తప్పక నిధి ఉండును.
పైన చెప్పిన విధముగా చాలా పద్ధతులు ఉన్నాయి . స్థలాభావం వల్లన వివరించలేకున్నా .
భూగర్బంలో ఉన్న నిధిని కనుగొనుటకు పురాతన పద్దతి –
ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకుని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశం నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలెను . 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతిపెట్టబడిన స్థలం నందు జాగ్రత్తగా తవ్విచూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి ఆ కుండ శిదిలిం అయ్యి ఉన్నచో ఆస్థానమున నిధి ఉన్నదని గుర్తించవలెను.
గమనిక –
ఈ నిధుల వేటలో పడి చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు . దయచేసి అత్యాశకి పోకండి .మీకు దక్కాలని రాసి ఉంటే ఆ సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు .
గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల – 350 రూపాయలు .

ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల – 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

9885030034

మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

About The Author