అతి త్వరలో దేశంలో ఎదో “సంచలనం” జరగబోతోంది-జాగ్రత్త…


‘ఆర్‌బిఐ’ ఆల్ ఆఫీసర్స్ లీవ్ ఒక్కసారిగా రద్దు …..
“సంథింగ్ టూ బిగ్” త్వరలోనే దేశంలో ఎదో జరగబోతోంది……
ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముందు భారీ ఆర్ధిక మాంద్యం పొంచి వుంది.
భారతదేశంలో ఇప్పుడు ప్రకటించని ఆర్థిక సంక్షోభం ఉంది. ఇలాంటి సంక్షోభాలు ప్రజలకు నెమ్మదిగా కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితి సంక్షోభం యొక్క మొదటి రౌండ్ మాత్రమే అని నేను భావిస్తున్నాను.
ఈ మధ్యే బ్యాంకుల ‘ఎన్‌పిఎ’ ను పెంచారు అంటే మూలధన కొరత, అంటే తాజాగా పెట్టుబడి లేదని అర్ధం. దివాలా చట్టం ఆసరాతో బ్యాంకులో బాకీలు ఎగ్గొట్టటం లేదా దేశం వదిలి పారిపోవటం, బ్యాంకు ఉద్యోగుల్లో మరియు వ్యాపార సంస్థలలో నిరంతర మోసాలు దీనికి కారణం అయివుండొచ్చు.
గృహాలను కొనుగోలు, అమ్మకాలు చేయడం తగ్గిపోయింది. అంటే ఉక్కు, సిమెంట్, బాత్రూమ్ అమరికలు, నిర్మాణాలు క్షీణించడం. దీని వలన బ్యాంకులలో ‘ఎన్‌పిఎ’లు ఇంకా పెరుగుతాయి. ఈ ఎన్‌పిఎలు సంక్షోభాన్ని మరింత ఎక్కువ చేయడం ద్వారా వ్యక్తిగత స్థాయికి కూడా రావచ్చు.
వాహన అమ్మకాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మొదటిసారి ద్విచక్ర వాహనాల అమ్మకం ప్రతికూల వృద్ధిని చూపుతోంది. మారుతి ఉత్పత్తిని 50% తగ్గించింది. చాలా మంది ఆటో డీలర్లు మూసివేస్తున్నారు. అంటే ఉక్కు, టైర్ మరియు ఇతర ఉపకరణాలపై గణనీయమైన తగ్గింపు చేయాలని డిమాండ్ ఉంది.
పై మూడు విషయాలు కోటి ఉద్యోగాల తొలగింపుకు మరియు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించడం పై ప్రబావితం చూపుతాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం విసుగు చెంది, ప్రతిదానిపై పన్నులు వేయడం ద్వారా తన నష్టాన్ని పూర్తి చేయాలనుకుంటుంది,లేదా ప్రభుత్వం లాభాలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తుంది మరియు ఆ నష్టాన్ని (లోటును) ప్రభుత్వ ఖాతాలో చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఆస్తులు తమ అభిమాన కార్పొరేట్ శక్తులకి తక్కువకే అమ్ముతారు. అందువలన కూడా నష్టాలు పెరుగుతాయి.
భారతదేశంలో ఈ సంక్షోభం మార్చి 2020 లో సామాన్య ప్రజల స్తాయికి రావొచ్చని నాకనిపిస్తుంది, సగటు భారతీయులలో చాలామందికి దీని గురించి తెలియదు. చిన్న వ్యాపారస్తులు సబ్బు, షాంపూ మరియు డిటర్జెంట్ లాంటివి కూడా అమ్మలేకపోతున్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది.

గత కొన్ని సంవత్సరాలుగా, “ఎఫ్‌ఎంసిజి” రంగం కూడా మాంద్యం యొక్క పట్టులో ఉంది.

బాబా రామ్‌దేవ్ పతంజలి కంపెనీ ప్రకటనను మీరు చివరిసారి ఎప్పుడు చూసారో మీకు గుర్తుందా? పతంజలి టీవీలో 2 సంవత్సరాల క్రితం చాలా చురుకుగా ఉండేది, కానీ గత ఒక సంవత్సరం నుండి, భారతదేశ “ఎఫ్‌ఎంసిజి” మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పతంజలి పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉంది.. పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఇది కాకుండా, “పతంజలి ఆయుర్వేదం” కంపనీ 2018 ఆర్థిక సంవత్సరంలో 10% రెవెన్యూ లోటును చూపించింది. పతంజలి, హిందూస్తాన్ లివర్ వంటి అగ్ర సంస్థలు కూడా వృద్ధిలో లేకుండా పడిపోయాయి.

గ్రామీణ ప్రాంతాల్లో సబ్బు, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, బిస్కెట్లు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులకు కూడా డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఎంట్రీ లెవల్ కార్లను తయారుచేసే “ఎఫ్‌ఎంసిజి”, ద్విచక్ర వాహనాలు,ఆటో కంపెనీలు లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల మీద ఆధారపడిన ఆ వ్యాపారాల అభివృద్ధి కూడా మందగించింది.

ఇప్పుడు రవాణా “ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్” నివేదిక ప్రకారం, ట్రక్ అద్దెలలో (బాడుగల్లో) 15% తగ్గుదల నవంబర్ 2018 నాటికి నమోదు అయ్యింది. అలాగే ‘ఫ్లీట్ యుటిలైజేషన్’(లగేజీ రవాణా వాహనాలు ఉపయోగించటం) దాని కంటే ఎక్కువ పడిపోయింది. మొత్తం 75 ట్రంక్ రవాణా మార్గాలు, అద్దెలు గణనీయంగా తగ్గాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం వల్ల సరుకు డిమాండ్‌పై స్పష్టమైన ప్రభావం ఉంది. ట్రక్కుల ద్వారా రవాణాకు ఎక్కువ అవకాశాలుండే ఉత్పాదక రంగం నుండి డిమాండ్ కనీస స్థాయిలో కూడా లేదు.

గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్ మరియు జూన్ మధ్య, ఫ్లీట్ యుటిలైజేషన్ 25% నుండి 30% కి తగ్గింది. కనుక ఇది రవాణాదారుల ఆదాయాన్ని కూడా 30% తగ్గిస్తుంది. తరువాతి త్రైమాసికంలో చాలా మంది ఆపరేటర్లు ఫ్లీట్ యొక్క EMI ల డిఫాల్ట్లో కూడా వుండి ఉండవచ్చు.

నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నెలవారీ ఖర్చు తగ్గింది. ఏప్రిల్‌ తరువాత వ్యవసాయంలో రవాణా దాదాపు మందగించింది. జూన్‌లో “ఎఫ్‌ఎంసిజి” ద్వారా పండ్లు, కూరగాయల డిమాండ్ 20% తగ్గింది. సరుకు రవాణా డిమాండ్ తగ్గడం వల్ల, మొదటి త్రైమాసికంలో ట్రక్ బాడుగలు దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో 30% తగ్గాయి.

ఈ స్థితిని సరిదిద్దటానికి ప్రభుత్వం ఎదోచేయ బోతుంది. ఆర్ధిక మంత్రి ట్వీట్లు ఆ దిశగానే వున్నాయి కానీ ఏమిటో తెలీదు
“సంథింగ్ టూ బిగ్” త్వరలోనే దేశంలో ఎదో జరగబోతోంది, జాగ్రత్తగా ఉండండి.

మీ డబ్బులు హారతి కర్పూరంలా కళ్ళ ముందే కరిగి పోవచ్చు.

About The Author