కూతురి మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లిన తండ్రి

కరీంనగర్: ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో కూతురి మృతదేహాన్ని తండ్రి చేతులపై మోసుకెళ్లాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారానికి చెందిన సంపత్‌ కూతురు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయారు. అయితే ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తన వద్ద డబ్బుల్లేవని, ప్రభుత్వ అంబులెన్స్‌ పంపాలని సంపత్ ఆస్పత్రి అధికారులను కోరారు. ఎంత బతిమాలినా అంబులెన్స్‌ పంపలేదు. చేసేదేమి లేక తండ్రి సంపత్ కూతురు మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

About The Author