ఇండియాలో క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది *ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్..


ఇండియాలో క్రికెట్ మంచి ఆదరణ ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గిల్ క్రిస్ట్ అన్నారు. గురువారం ఆయన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పరిధిలోని పగిడిరాయి గ్రామాన్ని సందర్శించారు. ఏపీ ప్రభుత్వం,ఏపీ ఎస్పీడీసీఎల్ భాగస్వాములుగా గురువారం పగిడిరాయి గ్రామంలో విలేజ్ ఎనర్జీ , micro grid ఫైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా ఇండియన్ రిసోర్సెస్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ,,ఆర్ డి టి,, గేట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంస్థ ఆహ్వానం మేరకు పత్తికొండ అ పగిడిరాయి గ్రామాన్ని సందర్శించి అక్కడి స్థానిక జిల్లా పరిషత్ ఆవరణంలో ప్రాథమిక, హై స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని గిల్ క్రిస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రికెట్లో మెళకువలు నేర్పారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తాపీగా సమాధానాలు ఇచ్చారు.

About The Author