ఫోర్జరీ కేసులో A1 నిందితుడు సోమిరెడ్డి పరారీ.


వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్‌ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది.

ఈపోర్జరీ డాక్యుమెంట్ల కేసులో సోమిరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావల్సి ఉన్నా రాలేదు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా, 41 సి కింద ఆయనను విచారించండని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కూడా సోమిరెడ్డి అందుబాటులోకి రాలేదట.దాంతో ఆయన హైదరాబాద్ ఉన్న ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారని సమాచారం.

About The Author