టీ20 సిరీస్ భారత్ కైవసం చేసుకోవడంతో పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఇవాళ బంగ్లాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ స్థానిక హోల్కర్‌ స్టేడియంలో జరుగుతుంది. తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్‌. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లా సారథి మోమినుల్‌ హక్‌ తెలిపాడు.
టీ20 గెలుపుతో జోష్ లో ఉన్న టీం ఇండియా…. ఇక ఒకవేళ టాస్‌ గెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకునేవాడినని కెప్టెన్ కోహ్లి స్పష్టం చేశాడు. టాస్ ఓడిన బౌలింగ్ టీం ఇండియా చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు కోహ్లీ.పిచ్ దృష్ట్యా పిచ్‌ తొలి రోజు సీమర్లకు అనుకూలించే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. దీంతో టాస్‌తోనే మ్యాచ్‌పై ఉత్కంఠ కలిగింది.

భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ.

బంగ్లాదేశ్‌: మోమినుల్‌ హక్‌ (కెప్టెన్), షాద్‌మన్, ఇమ్రుల్ కాయెస్, మిథున్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, లిటన్‌ దాస్, మెహదీ హసన్, తైజుల్, అబూ జాయెద్, ఇబాదత్

About The Author