ప్రియాంక రెడ్డి మృతిపై అనుష్క సంతాపం

హైదరాబాద్‌:పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి మృతిపట్ల సినీ నటి అనుష్క సంతాపం తెలిపారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయని ఆమె అన్నారు. సమాజంలో మహిళగా పుట్టడం నేరమా అని అనుష్క ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. ‘అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి చంపేశారు. ఇది మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన ఘటన. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని కనుక జంతువులతో పోలిస్తే అవి సిగ్గుపడతాయి.

మన సమాజంలో ఒక మహిళగా పుట్టడం నేరమా?. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారికి వెంటనే శిక్షపడే విధంగా మనమందరం కలిసి పోరాటం చేద్దాం. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. #RIPPriyanka Reddy’ అని అనుష్క పేర్కొన్నారు.

About The Author