పంచమి తీర్థం సందర్బంగా ట్రాఫిక్  మళ్లింపు 

తిరుపతి:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల  సందర్భముగా డిసెంబర్ ఒకటవ తారీకు జరుగు పంచమితీర్థం సంధర్భముగా తిరుపతి మరియు తిరుచానూరు పరిసర ప్రాంతముల నందు  ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టారు.ఇందులో భాగముగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారు వాహనముల మళ్లింపులు మరియు పార్కింగు ప్రదేశాలను నిర్దేశించారు. అర్భన్ పోలీసువారి సమాచారం మేరకు… పుష్కర స్నానం కొరకు వాహనాలలో వచ్చు భక్తులందరూ తమ వాహనాలును వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుకొని అక్కడ నుండి కాలి నడకన తిరుచానూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉన్న కంపార్ట్మెంట్ ల లోనికి వెళ్ళవలెను.  ట్రాఫిక్ మళ్లింపులు: ఆర్టీసీ బస్సులు తేదీ నవంబర్ 30 అర్థరాత్రి నుండి డిసెంబర్ సాయంత్రము 04.00 గ౦టల వరకు తిరుచానూరు లోనికి ప్రవేశము లేదు.  తిరుపతి   ఆర్టీసీబస్ స్టాండు నుండి మదనపల్లి, బెంగళూరు ,చిత్తూరు వైపు వెళ్ళు బస్సులు పూర్ణకుంభం  నుండి లీలమహహల్ సర్కిల్, కపిలతీర్థం, గరుడ సర్కిల్మీదుగాఅనుమతించబడును.

About The Author