సుధా మూర్తికి అమితాబ్ పాదాభివందనం..!


సుధా మూర్తి ..పరిచయం అక్కర లేని పేరు..ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గా ఆమె చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో దేశవిదేశాల్లో సైతం మంచి పేరు సాధించారు.ఇంతటి ఔన్నత్యం కలిగిన ఆమె పాదాలకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నమస్కారం చేసి అభినందించారు.. ఈ సంఘటన కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 11 లో జరిగింది. 19 ఏళ్ల కేబీసీ ప్రయాణంలో ఇప్పటికి 11 సీజన్లు పూర్తయ్యాయి. 10 సీజన్లకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి 11వ సీజన్‌లో భాగంగా జరిగిన చివరి ఎపిసోడ్‌లో సుధా మూర్తి పాల్గొన్నారు. ఆమె నేపథ్యం గురించి అమితాబ్ తెలుపుతూ వందల స్కూళ్లు, 60 వేల లైబ్రరీలు, 16 వేలకు పైగా టాయిలెట్స్ కట్టించినట్టు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన సుధామూర్తి తనకంటే వయసులో చిన్నదైనా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమెను గౌరవించడమేనంటూ పాదాభివందనం చేశారు అమితాబ్..ఈ సందర్భంగా సుధా మూర్తి మాట్లాడుతూ, తాను చదువుకున్న కాలేజీలో టాయిలెట్ లేదని, అందుకనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున టాయిలెట్స్ కట్టించామని తెలిపారు. అలాగే దేశంలో దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫౌండేషన్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, ఇలా చేస్తూనే ఉంటాని అన్నారు.

About The Author