తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి సేవలో శ్రీవారి సేవకులు

తిరుపతి:తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న వేలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు.

”మానవసేవయే మాధవసేవగా” భావించి టిటిడి 2000వ సంవత్సరంలో తిరుమలలో ”శ్రీవారి సేవ” స్వచ్ఛంద సేవను ప్రారంభించింది. అప్పటి నుండి తిరుమలకు విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు. టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలందిస్తునారు. టిటిడి స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించుకుంటూ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారిని భాగస్వాములను చేస్తోంది. దేశ విదేశాలలో టిటిడి నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాలైన మనగుడి, కైశిక ద్వాదశి, గోపూజ, శ్రీనివాస కల్యాణాలు, శ్రీవేంటేశ్వరస్వామివారి వైభవోత్సవాలలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని సేవలందిస్తున్నారు.

 

 

About The Author