మే 4 నుంచి లాక్‌డౌన్ సడలింపులు: కేంద్ర హోంశాఖ

 


మే 4వ తేదీ నుంచి భారీ స్థాయిలో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉండనున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మే 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఉంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే ఆ నిబంధనలు ఎలా ఉంటాయి? అవి ఏంటనేది త్వరలో తెలియజేయనుంది. నిన్న రాత్రి హోమ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల అనేక లాభాలు చేకూరాయని, వాటిని కొనసాగించడానికి మే 3 వరకూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా పాటించాలన్నారు.

మే 4వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని, సాధ్యమైనంతమేర, మెజారిటీ జిల్లాల్లో లాక్‌డౌన్‌కి సంబంధించిన నిబందనల సడలింపు ఉంటుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతామని అన్నారు.

About The Author