ఫేస్‌బుక్‌లో పరిచయం.. రూ.10.90 లక్షలు స్వాహా

నారాయణగూడ:ఫేస్‌బుక్‌లో పరిచయమై రూ. 10.90 లక్షలు కాజేశాడో సైబర్‌ నేరస్థుడు. సైబర్‌ పోలీసు ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన ప్రీతి బిరాదర్‌కు ఓవ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు.స్నేహానికి గుర్తుగా బహుమతిని పంపిస్తున్నానని ప్రీతికి చెప్పాడు. అనంతరం దిల్లీ విమానాశ్రయంనుంచి మాట్లాడుతున్నాం.మీకో బహుమతి వచ్చింది.దానిని డెలివరీ చేయాలంటే టాక్సులు చెల్లించాలని చెప్పి రూ.10.90 లక్షలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు.బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

About The Author