రామచంద్రపురం మండలం వెంకటపాలెం పంట కాలువ లో స్నానానికిదిగి ముగ్గురు మృతి…

రామచంద్రపురం మండలం వెంకటపాలెం పంట కాలువ లో స్నానానికిదిగి ముగ్గురు మృతి…
మృతి చెందిన కనికెళ్ళ రంజిత్ కుమార్(15),బొక్క వీరేంద్ర (18),వేమన పావని (15)ల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి కి తరలింపు..
సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించిన
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్,
మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్..
మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి సుభాష్..
మృతులంతా కపిలేశ్వరపురం మండలం అంగర, పడమర ఖండ్రఖ,
తాతపూడి గ్రామాలకు చెందిన వారు…
అక్కా చెల్లెళ్ళ పిల్లలైన వీరు హైదరాబాద్ లో ఉంటున్నారు…
రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామం లో అమ్మమ్మ ఇంటికి నిన్న జరిగిన తాతయ్య సంస్కరణ కార్యక్రమానికి వచ్చారు..
అయితే ఈరోజు సమీపంలో ఉన్న వెంకటాయపాలెం పంట కాలువ లో స్నానానికి దిగి
ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందారు…
దీంతో వెలంపాలెంగ్రామం విషాద ఛాయలు అలుముకున్నాయి..
