రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తిరిగి బాధ్యతలు చేపడతా…. రమేష్ కుమార్


హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నానని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు. వ్యక్తులు కాదు.. రాజ్యాంగ వ్యవస్థలు, విలువలు శాశ్వతమని ఆయన అన్నారు. గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తానని అన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంపట్ల హర్షం వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

ఎస్ ఈ సి తొలగింపు అంశంపై ఏపీ సర్కార్ తెచ్చిన జీవోలు హైకోర్టు కొట్టేయడం హర్షణీయం.

స్థానిక ఎన్నికల ప్రక్రియ తిరిగి నామినేషన్ల ప్రక్రియ నుండి మొదలుపెట్టాలని కోరుతున్నాం.
– రామకృష్ణ.

About The Author