పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలి…


పెద్దపంజాణి మండలం లో శనివారం రాత్రి పిడుగు పడిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మండలంలోని తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం పొలం వద్ద పాలు పితికే ఎందుకు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి వెళ్ళాడు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పొలం వద్ద పాలు పితుకుతూ ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి 24 మీనా 22 లు మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనను పోలీసులకు సమాచారం అందజేశారు కాగా రామకృష్ణ భార్య విషయం తెలుసుకున్న వెంటనే స్నేహ కోల్పోయింది వారి ఆర్తనాదాలు లతో గ్రామం దద్దరిల్లింది సంఘటన స్థలాన్ని శనివారం రాత్రి గంగవరం సీఐ రామకృష్ణ చారి పరిశీలించారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

About The Author