సంక్షోభం లోను ఆగని అభివృద్ధి పనులు…


ఒక కోటి 50 లక్షల రూపాయలతో రహదారి పనులకు శంకుస్థాపన…

41 లక్ష రూపాయలతో మోడల్ దోభీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు..

ఆదివారం నగరంలో అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు శంకుస్థాపన చేశారు..

పాల ఫ్యాక్టరీ నుంచి చిట్టినగర్ వరకు ఒక కోటి 50 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు మరియు కె.ఎల్.రావు పార్క్ రోడ్, లంబాడి పేట ఈ ప్రాంతంలో దాదాపు మూడు వందల కుటుంబాలకు ఉపయోగపడే విధంగా మోడల్ దోభీఖానా కు 41 లక్షల తో అభివృద్ధి పనులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్ధాపన చేశారు.

ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సమయం లో కూడా అభివృద్ధి పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయడంతో గ్రీన్ జోన్ ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు….

కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులతో పాటు వైయస్సార్ సిపి పార్టీ శ్రేణులు ఉన్నారు….

About The Author