కాలేజీలు ఇప్పుడే తెరువం: ఇంటర్ బోర్డు..


లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడి యస్ కాలేజీల పునఃప్రారంభ తేదీని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభ తేదీ లను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

జూలై ఒకటిన పాలిసెట్ టీఎస్ పాలిసెట్ ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్టు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్ని కల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆదివారం ప్రకటించింది. పాలిసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 9 వరకు, పైకి 12 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు.

పది విద్యార్థులకు టీశాట్ అవగాహన కార్యక్రమం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మనోధైర్యాన్ని పెంచేందుకు ఈ నెల 2 నుంచి టీశాట్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు టీశాట్ సీఈవో ఆర్ శైలేశ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గణితం మొదటి పేపర్, మధ్యాహ్న 2 నుంచి 3 గంటల వరకు రెండో పేపర్, 3న సైన్స్, 4న సోషల్ స్టడీస్, ఐదోతేదీన ఆంగ్ల పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. సందేహాల నివృత్తికి 1800 425 4088 లేదు 04023558473 నంబర్ల సంప్రదించాలన్నారు.

About The Author