లారీ, స్కూటీ ఢీ నలుగురికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లా:పీలేరు-కడప జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. శుక్రవారం రాత్రి పీలేరు మండలం, కావలిపల్లి పంచాయతీ, పొంతలచెరువు క్రాస్ వద్ద లారీ, స్కూటీని ఢీ కొన్న ప్రమాదంలో కె.వి. పల్లి మండలం,  ఎం.వి.పల్లి పంచాయతీ కుంటి మేకల పల్లికి చెందిన వెంకట రమణా రెడ్డి (40), అతని భార్య అనిత (30), కుమార్తె చరిత (8), కుమారుడు భరద్వాజ్ రెడ్డి (5) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు ఎస్సై వెంకటరమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

About The Author