ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మునగపాక, పరీక్ష తప్పిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా మునగపాక మండలంలో చోటుచేసుకుంది. గంటవానిపాలేనికి చెందిన కోన జగదీశ్‌ (17) అనకాపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివాడు. శుక్రవారం ఫలితాలు విడుదల కాగా…తాను ఫెయిలైనట్టు తెలుసుకున్న జగదీశ్‌ తట్టుకోలేక ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. పక్క ఇంట్లో ఉన్నవారు చూసి వెంటనే అనకాపల్లి ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. జగదీశ్‌ తల్లిదండ్రులు గోవింద, సన్యాసమ్మ తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్దకొడుకు ఇంజనీరింగ్‌ చదువుతుండగా, జగదీష్‌ చిన్న కుమారుడు. 

About The Author