ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాకు నో ఎంట్రీ

అమరావతి: ఏపీలో 16నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియా కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ దృష్ట్యా మీడియా పాయింట్‌ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్‌ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

About The Author