వైకాపా అరాచకాలపై ఫిర్యాదు..

తిరుపతి:రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు..

రాష్ట్రంలో, జిల్లాలో  శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపా శ్రేణులు టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులకు దిగుతున్నారని ఆర్ డి ఓ కు సమర్పించిన వినతి పత్రం లో టిడిపి నేతలు పేర్కొన్నారు. అంతేకాక ఇసుక, మద్యం అక్రమ భూ లావాదేవీల విషయంలో వైకాపా కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు బరితెగించి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపించారు..అంతేకాక అవినీతిని ప్రశ్నించిన వారిని  వేధిస్తున్నారని,అక్రమాలను ఎదుర్కొనే వారి పట్ల ప్రభుత్వ అండదండలతో వేధింపులకు గురి చేసే కార్యక్రమానికి వైకాపా వారు శ్రీకారం చుట్టారని, ఇలాంటి వారిపట్ల ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు..

 ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తో పాటు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పవతి, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ సి మునికృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ నేతలు రవి నాయుడు, ఆనంద్ గౌడ్, తదితరులు

About The Author