బిక్కుమల్ల సంతోష్ బాబు కు పూల మాల & కొవ్వొత్తులతో నివాళి


*భారతమాత* ముద్దుబిడ్డ *బిక్కుమల్ల సంతోష్ బాబు* వీర జవాన్ చిత్రపటానికి *పూల మాల & కొవ్వొత్తులతో* నివాళి అర్పించిన… *దాసరి రంగనాథ్* మాల యువత కృష్ణా జిల్లా కన్వీనర్ , ఆంధ్ర ప్రదేశ్ .

*దేశం కోసం* ప్రాణాలను త్యాగం చేసిన *కల్నల్ సంతోష్ బాబుకి* ఉయ్యూరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో *ఘనమైన నివాళులు* అర్పించారు .

*భారతదేశంలోని* సైనికుల *వీర మరణ త్యాగ నిరతికి* ఈదేశంలో ఉన్నప్రతి *పౌరుడి* తరుపున *అమరులైన* వారి ఆత్మకు *శాంతిని* , వారి కుటుంబాలకు *ఓదార్పు* కలగాలని కోరుకుంటూ…

ఈరోజు *ఉయ్యురు* గ్రామ ప్రధాన కూడలిలో *కల్నల్ సంతోష్* గారి చిత్రపటానికి *మౌనం పాటించి , పుాల మాలలు కొవ్వోతులతో* ఉయ్యూరులో *ప్రజాసంఘాల* ఆధ్వర్యంలో ఘనమైన *నివాళి అర్పించి* పొరుగు దేశాల ఆగడాలను దహించి వేయాలని *ప్రజా సంఘాల* నాయకులు కోరారు .

ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక వ్యవస్థాపకులు *పినమాల నాగకుమార్* , ముస్లిం మైనారిటీ నాయకులు *అబ్దుల్ రసూల్ , అన్వర్ భేగ్* , పాష్టర్ ఫెలోషిప్ ఉయ్యూరు మండలం అధ్యక్షులు *పాష్టర్ జాన్ క్రాస్* , ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులు *వెంట్రప్రగడ వీరాంజనేయులు* బిసి నాయకులు *ప్రాకెర్ల ఆంజనేయులు , ఊడుగుల బాలాజీ* , కృష్ణజిల్లా మాల యువత అధ్యక్షులు *దాసరి రంగనాథ్* , దళిత అభ్యుదయ సేవ సమితి కన్వీనర్ *శీలం రాజు* , రజిక నాయకులు *రాచకొండ రాము* , *మట్టా పుార్ణా ,చేవుారి సుధాకర్ వడ్డాది ప్రసాద్ , వరుణ్* తదితరులు పాల్గొని తమ దేశభక్తిని “” *భారత్ మాతాకీ జై* “” అని నినదించారు .

About The Author