చిత్తూరు జిల్లా గుడిపాల మండలం లో దారుణం

చిత్తూరు జిల్లా:గుడిపాల మండలం ఏ,యల్ ,  పురం గ్రామం లో పురుగుల మందు ను చికెన్ మసాలా అనుకుని కూరలో కలపడంతో  కూరను తిన్న ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో,సోమవారం సాయంత్రం ఆ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఇలా ఉన్నాయి,

గుడిపాల మండలం  వెంగమాంబా పురం పంచాయతీ  ఏ యల్ పురం కు చెందిన గోవిందమ్మ   కుమార్తె ధనమ్మ పిల్లలు, చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన జీవ, రోహిత్ లు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చారు.    మనవళ్ళు రావడంతో గోవిందమ్మ ఇంటికి చికెన్ ను తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న పురుగుల మందును, వండే సమయంలో చికెన్ మసాలా అనుకుని కూరలో కలిపి వండి పెట్టింది. తెలియకపోవడంతో పిల్లలతో పాటు గోవిందమ్మ కూడా   కూరను తిన్నది. ముగ్గురు ఒక్కసారిగా అస్వస్థకు గురికాగా,వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులు ఇద్దరు మృతి చెందారు.వృద్ధురాలు గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉంది .గుడిపాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

About The Author