దారుణం..బాలికపై మేనమామ అత్యాచారం.!

 

తెలంగాణ:హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఎస్ జైన్ స్కూల్ సమీపంలో  నివాసం ఉంటున్న పన్నెండు సంవత్సరాల బాలిక పై ఇంటిపక్కనే నివసించే సిటీ క్రైమ్ కానిస్టేబుల్ ఉమేష్ అత్యాచారం చేశాడు. లాక్ డౌన్ తో స్కూల్ లేకపోవడం తో ఇంట్లో ఒంటరిగావున్న బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఉమేష్ బాలికకు మేనమామ కావడం విశేషం. అతడికి వివాహం జరిగి ఓ కూతురు కూడా ఉంది. ఈ ఘటన పై బాలిక తల్లి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. వెంటనే నగర అదనపు పోలీస్ కమిషనర్ షికాగోయల్ కి సమాచారం ఇవ్వగా  బోయిన్ పల్లి పోలీస్ లు కేసు నమోదు చేశారు. నిందితుడి పై పోక్సో,అత్యాచారం కింద కేను నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం కోరింది. అంతేకాకుండా పోక్సో చట్టం కింద బాధితురాలికి ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేసింది. విషయం ఎవ్వరికీ చెప్పవద్దు అనటంతో బాలిక భయంతో వణికిపోతుంది. దాంతో ఆమెను సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరింది. నిందితుణ్ణి వెంటనే ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.

About The Author