ప్రతి రోజూ 13వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..

తిరుమల . కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతించిన టిటిడి ఇప్పడా సంఖ్యను పెంచింది.. ముందుగా ఆరువేల మందికి రోజూ దర్శన భాగ్యం కల్పించిన పాలక మండలి క్రమంగా ఆ సంఖ్యను 10వేలకు పెంచింది.. తాజాగా 13వేల మందిని అనుమతిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ స్పష్టం చేసింది..

About The Author