ఎర్రచందనం దుంగలుతోసహ వాహనం స్వాధీనం.

50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం.

చిత్తూరుజిల్లా ఎస్పీ‌ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పీలేరు రూరల్ సిఐ మురళీకృష్ణ, రొంపిచర్ల ఎస్ఐ హరి ప్రసాద్, యర్రావారిపాల్యంఎస్ఐ సోమశేఖర్ ప్రత్యేక టీములుగా విడిపోయి అనుమానిత  వాహనాలు తనిఖీ చేస్తుండగా రొంపిచర్ల, భాకరాపేట సమీప ప్రాంతాల్లో అనుమానంగా అశోక్ లైలాండ్ ఒక వాహనం రావడంతో ఆ వాహనాన్ని మార్గమధ్యంలోఆపి తనిఖీ చేయగా ఆ వాహనంలో మామిడి పండ్లు కింద22 ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తుండగా  వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు వాహనంలో ఉన్న డ్రైవర్ వాహనం వదలి పరారయ్యాడు వాహనం వెంట హీరో హోండా ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు వీరు పాత నేరస్తులను గానుగ చింత కు చెందిన మల్లికార్జున్ రెడ్డి, మల్లెల కు చెందిన చంద్రాలు వీరిపై పలు కేసులు నమోదు అయ్యాయని పలు స్టేషన్లలో కేసులు నమోదు ఉన్నాయని తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

About The Author