టాస్క్ ఫోర్స్ ఎస్పీకి పదోన్నతి పై బదిలీ : వీడ్కోలు పలికిన ఉద్యోగులు

తిరుపతి,జూలై 27 2020,టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, ఎస్పీ శ్రీ రవి శంకర్ పదోన్నతి పై  బదిలీ కావడంతో, టాస్క్ ఫోర్స్ ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

సోమవారం,సాయంత్రం ఆయన తన బాధ్యత ల నుంచి రిలీవ్ అయ్యారు. తన బాధ్యతలను అనంతపురం రేంజ్ డిఐజి శ్రీ కాంతి లాల్ రాణా కు అప్పగించారు. శ్రీ రవి శంకర్ ఏపీఎస్ పి  కర్నూలు రెండవ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యత లు చేపట్టనున్నారు. ఆయన 2017 నుంచి టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పని చేస్తున్నారు. గత సంవత్సరం టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జి గా బాధ్యత లు చేపట్టారు. అప్పటి నుంచి 66 ఎర్రచందనం కేసు లు పట్టుకోగా, 160 మంది స్మగ్లర్లు ను అరెస్ట్ చేశారు. 1205 ఎర్ర చందనం దుంగలు, 42 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పదోన్నతి పై  బదిలీ పొందిన శ్రీ రవిశంకర్ కు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

About The Author