పాలల్లో మురికి నీళ్లు కలిపినందుకు అరెస్టు చేసిన పోలీసులు…


పాలల్లో మురికి నీళ్లు కలిపినందుకు గాను ఓ పాడీ ఫాం యజమానిని దబీర్‌పూర పోలీసులు అరెస్టు చేశారు.

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 269, 272, 273 కింద అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

పోలీసులు తెలిపిన వివరాలు..

దబీర్‌పురలోని గోల్ఖబార్‌లో జహంగీర్‌ డెయిరీ ఫామ్ యజమాని మహ్మద్ సోహైల్ బర్రెకు చెంబులో పాలు పితికి బకెట్‌లో పోస్తున్నాడు.

మధ్యలో చెంబులోని కొన్ని పాలను తాను తాగి మిగిలిన ఎంగిలి పాలను మళ్లీ బకెట్‌లో కలిపాడు.

ఆ తరువాత పాడీ ఫాంలో పశువులు తాగడానికి ఉంచిన నీటినే పాలల్లో కలిపాడు.

పాడి ఫాం పక్కింట్లో నివసిస్తున్న వ్యక్తి ఈ మొత్తం తతంగాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు.

వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

ఈ వీడియో సోషల్ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్థానికులు సోహైల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతడిని అరెస్టు చేసి పాడీ ఫాంను సీజ్‌ చేశారు. 

About The Author