ముక్కంటీశునికి మొక్కు చెల్లింపు…


శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కరోన నుంచి కోలుకున్న సందర్భంగా స్థానిక వైసీపీ నేత 22 వ వార్డు మాజీ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్య మొక్కులు చెల్లించుకున్నారు .

ఎమ్మెల్యే గారు కరోన బారి నుంచి సురక్షితంగా బయటపడి ఆరోగ్యంగా ఉంటే తలనీలాలు చెల్లిస్తానని ఆయన గతంలో శ్రీకాళహస్తీశ్వరుని కోరుకున్నారు.

ఆయన కోరిక నెరవేరి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో శ్రీకాళహస్తి ఆలయంలో తలనీలాలు సమర్పించారు. ముక్కంటి దర్శనానంతరం ఆలయ పండితులు తో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి ఆశీర్వచనాలతో శివపార్వతుల కలంకారి చిత్రపటాన్ని అందజేశారు.

నిత్యం శ్రీకాళహస్తి ప్రజల కోసం పాటుపడే బియ్యపు మధుసూదన్ రెడ్డి కరోనా సమయంలో ప్రజలకు అన్నివిధాలుగా అండగా నిలిచారన్నారు. జనానికి సాయం చేసే క్రమంలో ఆయన కరోనా బారిన పడటం బాధాకరమైన పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు మాజీ వైసీపీ కౌన్సిలర్ బొద్దులూరి ధర్మయ్య ( డిష్ ).

About The Author