రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం…


భాకరాపేట ఘాట్ లో ఘటన
చిత్తూరు జిల్లా బాకరాపేట ఘాట్ రోడ్ లో ట్రాక్టర్ టాలీ ఊడి ఎదురుగా స్కూటీలో వస్తున్న తల్లీ బిడ్డల పైకి దూసుకెల్లడంతో తల్లి, కుమారుడు అక్కడికక్కడే చనిపోగా కుమార్తె ను తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ ఎం. రవి నాయక్ తెలిపిన వివరాల మేరకు చిత్తూరు జిల్లా యాదమరి మండలం 184 గొల్లపల్లి కి చెందిన పి దేవేంద్ర కుమార్ భార్య పి.జమున(30) తన కుమార్తె మీనాక్షి (12),కుమారుడు దీపక్ కుమార్ (8)లు స్కూటీలో ఐతేపల్లి నుంచి చిన్నగొటిఘల్లు మండలం బాకరాపేటకు వస్తుండగా, శ్రీకాళహస్తి కి చెందిన ట్రాక్టర్ నెల్లూరు జిల్లా నాయుడుపేట నుండి గడ్డిని తీసుకుని వాల్మీకిపురం మండలం చింతపర్తి పరిసర ప్రాంతాల్లో దింపి తిరిగి శ్రీకాళహస్తి కి వెళుతుండగా బాకరాపేట ఘాట్లో ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ వేరుపడి ఎదురుగా వస్తున్న వీరిపైకి దూసుకెల్లడంతో జమున, దీపక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా,మీనాక్షిని తిరుపతి రుయా కు తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్ ఐ ఎం. రవి నాయక్ తెలిపారు.పీలేరు రూరల్ సిఐ మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

About The Author