డబ్బు దానం చేస్తే ఆకలి తీరుతుంది …అదే రక్త దానం చేస్తే మీరు ఒకరికి జీవితాన్నే ఇస్తారు.


*తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…*

సార్,

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా రేణిగుంట సబ్ డివిజన్ పరిదిలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు రక్తదాన శిభిరాన్ని ప్రారంభించినారు.

ఈ సందర్బంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ కొన్ని అత్యవసర పరిస్థితిలో రక్తం దొరకక, రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారని, ఇలాంటి పరిస్థుతలను కొంతవరకైనా మెరుగు పరచాలనే ఉద్దేశంతో అర్బన్ జిల్లా పోలీసులు పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారోత్సవాలలోనే కాకుండా భవిష్యత్తులో జిల్లా మొత్తం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా లబించిన రక్త నిధిని అత్యవసర పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగకరంగా ఉండేటట్లు చేసి, ప్రజా స్రావంతిలో పోలీసులు మెరుగైన సేవలు చేసేందుకు పోలీసులకు – ప్రజలకు తస్సంబందాలు ఏర్పడి ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పడుతాయని, డబ్బు దానం చేస్తే ఆకలి మరియు ఇతర అవసరాలు మాత్రమే తీరుతుంది. అదే రక్త దానం చేస్తే మీరు ఒకరికి జీవితాన్నే ఇచ్చిన వారవుతారని ఈ సందర్భంగా జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు తెలిపారు.

అనంతరం రక్తదానం చేసిన వారికి జిల్లా యస్.పి గారు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డి.యస్.పి చంద్రశేఖర్, సి.ఐ లు అంజు యాదవ్, అమర్నాథ్ రెడ్డి, యస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author