కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే రాష్ట్రానికి శ్రీరామ రక్ష

కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌

తిరుపతి: కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ అన్నారు. కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. దేశాభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. నిన్న అధికారంలోకి వచ్చిన భాజపా అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. మన్నవరం ప్రాజెక్టు, రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యాసంస్థలు తెచ్చింది కాంగ్రెస్‌ అన్నారు.

వైకాపా ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం దారుణమన్నారు. 

About The Author