గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు…


గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు ప్రతి ఒక్కరు చదవి ఇతరులకు తెలియజేయండి
ఓపిక తో పూర్తిగా చదువ వలెను

ఈ కేసులో చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులు శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు 20 లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ 22 లక్షలు, శ్రీ మహేష్ జీత్మలానీ 35 లక్షల దాకా తీసుకుని వీరంతా గోమాంస వ్యాపారుల తరపున కేసును వాదించారు.

ఇక మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత ” కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే ?” అని అడిగినప్పుడు ” అది సంతోషమే కానీ, కేసు మేమే వాదించేందుకు అనుమతించాలని” శ్రీ రాజీవ్ భాయి కోరారు. కోర్టు అలా అనుమతిస్తునే, శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించడంతో కేసు కొనసాగింది.
ఇక గోమాంస వ్యాపారుల వాదనలు చూద్దాం.

1వ వాదన: గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.

2వ వాదన: గోవులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేక ఆకలితో చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.

3వ వాదన: మనదేశంలో మనుష్యులకే చోటులేదు. పశువులను ఎలా వసతి ఇస్తాం.

4వ వాదన: మనకు అత్యంత విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది.

5వ వాదన: మాంసాహారం తినడం మతపరమైన హక్కు.

ముస్లీం మతంలోని “ఎక్కువ గో హింసకు పాల్పడే ఖురేషీ” అనే వర్గంవారు ఈ వ్యర్ధ వాదనలు చేసారు.

ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనంతో, అన్ని గణాంకాలను కోర్టు వారి ముందుంచారు.

శ్రీ రాజీవ్ భాయి సమాధానాలు చూద్దాం.

ఒక ఆరోగ్యంగా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-

ఒక ఆరోగ్యమైన గోవు రోజుకి 10కిలోల గోమయం,( ఆవుపేడ ), 3 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు ” ఇది ఎలా సాధ్యం ” అని అడిగారు. ఆయన తన వాదనను నిరూపించటానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత కోర్టువారి ముందు శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారుచేసి కోర్టుకు సమర్పించారు. I R C శాస్త్రవేత్తలు గోమయంతో చేసిన ఎరువును పరీక్షించి అత్యుత్తమ సేంద్రీయ ఎరువుగా ప్రకటించారు. ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలు అందిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం 3 ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా 10 రెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో అంగీకరించింది.

శ్రీ రాజీవ్ భాయి కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా తాను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోవుపేడ నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, చూడమని ఆహ్వానించారు.

తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో 6 రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయం తెచ్చి పెడుతుంది. (౩౩ కిలోల ఆవు పేడ నుండి 330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా! 330 x Rs.6/-). పైగా ఈ గోవుల కు ఆదివారం శెలవులు కానీ లేవు కదా! ఈ లెక్కన గోమాత వలన ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే “ఆవు పేడ” వలన వచ్చే ఆదాయం.

శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాల ప్రకారం రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయం దాదాపు 1 కోటి 31 లక్షల 40వేలు రూపాయలు దాటిపోవడం చూచి ఆశ్చర్యం చెందారు.

వేల సంవత్సరాల పూర్వం నుండి గోమయంలో “లక్ష్మి” నివసిస్తుందని మన పూర్వీకులు ఎందుకు భావించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు.

ఇది హేళన చేసిన వారికి చెంపపెట్టు. “మెకాలే” చదువులు వంట బట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన “గోమయం లో “లక్ష్మి” నివాసముంటుంది అంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారని నవ్విన వారు నోళ్ళు వెళ్ళబెట్టారు.

ఇక “గోమూత్రము” పై శ్రీ రాజీవ్ భాయి గారి వివరణ – “ఒక గోవు రోజుకి 2 లేక 2.25 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఇది అనేకరకాల వ్యాధులకు, మధుమేహం, క్షయ, కీళ్ళ వాతం, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగ కు సంబంధించిన వ్యాధులు మొదలైన 48 రకాలైన రోగాలన్నీ సమూలంగా నిర్మూలించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపు తున్నాయి. (చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పారు)”.

ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం “పేటెంటు” కూడా చెయ్యబడింది. గోమూత్రానికి 3 పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేస్తున్నది.

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం (వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం రూ.3000/- X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 (అక్షరాల 2 కోట్ల 19 లక్షల రూపాయలు) గోమూత్రము వలన కోట్ల ఆదాయం.

ఇదే గోమయం “మిథైన్” అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో వంటకి వాడుకోవచ్చును. మన ద్విచక్ర వాహానాలను, మన కార్లు కూడా ఈ వాయువును తో నడుపుకోవచ్చును.

ఈ వాదన ధర్మాసనంలోని ఒక జడ్జీ నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి “మీరు అనుమతిస్తే, మీ కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీ కారు మీరే డ్రైవ్ చేసి మీరే పరీక్షించండి”. అని తన వాదన పటిమ చూపించారు. ఆ న్యాయాధీశుడు అనుమతించి, తన కారును 3 నెలలు మిథైన్ వాయువుతో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు 50నుండి 60 పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు 40 రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.

ఆ జడ్జీ సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నారు.

రోజు వచ్చే 10 కిలోల గోవు పేడతో ఎంత మిథైన్ వాయువు తయారవుతుందో, అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొదుపు చేస్తుందో చెప్పి ధర్మాసనంకు తన గణాంకాలు సమర్పించారు.

దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు 1 లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమైతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనక్కర లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనక్కర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది గోవు వల్లనే సాధ్యం.

ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనలో “సత్యాన్ని గ్రహించి, ” గో సంరక్షణ” వలన దేశానికి ఆర్ధికంగా, భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు.

సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, గో హంతకుల తల బొప్పికట్టి, దిక్కుతోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోందని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్ల రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.

అప్పుడు గోహంతకులు “గోమాసం తినడం ఇస్లాం మత పరమైన హక్కు” అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి” అయితే, ఎంతమంది ఇస్లాం పాలకులు ఈ మత పరమైన హక్కును వాడుకున్నారు? ఈ మత పరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ” అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.

అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు”. ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసం తినడంపై ఏమి చెప్పాయి ? ఆ హక్కనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని ఈ కమిటీని ఆదేశించారు.

ఈ కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.

“ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు “బాబర్” ఆయన తన “బాబర్ నామా”లో గోవధ నేరమని, అలాంటి నేరం తను చనిపోయినా ఈ దేశంలో జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు.

ఇక్కడ దక్షిణాపధంలో టిప్పుసుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసేవాడు కనపడితే “వాడి తలకాయ నరకమన్నాడు”. చాలామంది ఈ శిక్షలో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి, గోవధకు పాల్పడిన వారి” చేతులు నరకమన్నాడు”.

సుప్రీకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి, వాదనకు మరింత పుష్టి వచ్చింది.

“గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు” అని సూటిగా ప్రశ్నించారు.

తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా, హదీద్ లు, “గోవును రక్షించమని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి” అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దానిపట్ల దయగలిగి ఉండాలని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో ” గోవును వధించిన వాడికి నరకంలో కూడా స్థానం లేదు ” అని చెప్పారు.

తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు, గోవధను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాం మతహక్కు ఎలా అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనాలలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు.” అని ముగించారు.

గోహంతకులు మాన్పడిపోయారు. సుప్రీకోర్టు మాంసాహారులను, పదే పదే అడిగింది. వారు ఇస్లాంలో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు.

సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది.

ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.

తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.

“గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము, గోవును రక్షించడం రాజ్యాంగ ధర్మముగా భావించాలి.

మనం మన రాజ్యాంగంలో, “రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగం వ్రాసుకున్నాం. *ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది.”*

సుప్రీంకోర్టు తన తీర్పులో ” 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి” అని స్పష్టంగా పేర్కొన్నది.

శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోవు కొవ్వుతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. ఈ ఘటన మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసి, గో సంరక్షణ ప్రారంభమైంది. శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం.

గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం. అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరం కాదు.

వందే గోమాతరం! భారత జాతి యావత్తూ మాత “శ్రీలక్ష్మి “యే !!
స్వస్తి !!!!

చదివినవారికి ధన్యవాదాలు

About The Author