పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో ఉచిత అల్పాహార కార్యక్రమం ప్రారంభం


– పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో ఉచిత అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
– త్వరలోనే స్టడీ మెటీరియల్స్ కూడా అందజేస్తానని శిక్షణార్ధులకు హామీ.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ మైదానంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 230 ఉద్యోగార్థులకు శుక్రవారం ఉదయం ఉచితంగా అల్పాహార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం మీకు ప్రతి రోజూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇస్తానని, అందిస్తున్నట్లు అలాగే ఇవాళ మీతో కలిసి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో హాజరయ్యాను. గతంలో పత్తి మార్కెట్ యార్డులో, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ లో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో స్టడీ మెటీరియల్ ఇచ్చినట్లు, అదే తరహాలో త్వరలోనే మీకు స్టడీ మెటీరియల్ అందిస్తాము. రాత పూర్వక పరీక్షలకు సైతం శిక్షణ అందిస్తామని, అదే విధంగా 3 నెలల సమయం తర్వాత కావాల్సిన ఫిజికల్ శిక్షణ సైతం అందించేలా చూస్తాము. వీటితో పాటు మైదానంలో రన్నింగ్ ట్రాక్, హై జంప్, లాంగ్ జంప్ కు కావాల్సిన వసతులు కల్పిస్తాము.

About The Author