నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 9వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం…


హైదరాబాద్ – నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో 9వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
– దేశవ్యాప్తంగా ఉన్న 120 స్టాల్స్ హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర వాసుల కోసం ఈ నర్సరీ మేళాలో ఏర్పాటు చేశారు.
– తీరిక లేని పనులతో ఉండే నగర వాసులు ఇంట్లో మొక్కలు పెంచితే పని ఒత్తిడిని జయిస్తారు.
– మొక్కలు ఆనందాన్ని, మానసికోల్లోసాన్ని కలుగ జేస్తాయి.
– ఈ నర్సరీ మేళాలో ఆర్గానిక్, బోన్సాయ్, ఔషధ, అన్ని రకాల పూల, పండ్ల మొక్కలు కొలువు తీరాయి.
– మొక్కలతో పాటు వీటికి‌ సంబంధించిన అన్ని రకాల పని ముట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
– మొక్కను పెంచడమంటే భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే.
– మన పిల్లలకు ఆస్థి ఇస్తే‌ నిలుపుకుంటారో లేదో కాని మంచి పర్యావరణాన్ని ఇస్తే వాళ్లకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చినట్లే.
– డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. కాని ఆరోగ్యం పోతే తిరిగి రాదు.
– మంచి పర్యావరణం తోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది.
– తెలంగాణ ప్రభుత్వం ఇది గుర్తించే హరితహారం , సామాజిక అడవుల పెంపకం, అర్బన్ ఫారెస్ట్, పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టింది.
– నగర, పట్టణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పది శాతం పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
– మొక్కలు పెంచడం మన వ్యక్తిగత బాధ్యత.
– వాటర్ బాటిల్స్ కొనడం మనం చూస్తున్నాం. మనం మొక్కలు పెంచకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ బాటిల్స్ కొనాల్సి వస్తుందేమో.
– ప్రకృతిని ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడమే.
– కిచెన్ గార్డెన్ , రూఫ్ గార్డెన్ వంటి మంచి ట్రెండ్ నగరవాసులు పాఠిస్తున్నారు. ఇది అందరూ విధిగా పాఠించాలి. పిల్లలకు మొక్కలు పెంచడం నేర్పాలి.

About The Author