పవన్-పూరి సిట్టింగ్ లు?


కరోనా టైమ్ నుంచి ముంబాయిలో సెటిల్ అయిన దర్శకుడు పూరి జగన్నాధ్ అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా వస్తున్నారు. ఇలా వచ్చినపుడు ఒకటి రెండు సార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సిట్టింగ్ లు వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు వున్నాయి. అయినా కూడా మరో సినిమా చేసే ఆలోచనతోనే ఈ సిట్టింగ్ లు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. పూరి దగ్గర ఎప్పటికైనా తీయాలని పట్టుదలగా తయారుచేసుకున్న జనగనమణ అనే సబ్జెక్ట్ వుందన్న సంగతి ఊరంతా తెలిసిందే.
ఆ సబ్జెక్ట్ పై పూరి-పవన్ ల మధ్య డిస్కషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందుగా ఓ మాంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది.
పూరి తో జనగనమణ సబ్జెక్ట్ ను వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా మార్చి, పవర్ ఫుల్ డైలాగులు జోడించి చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనతో పవన్ ఈ సిట్టింగ్ లు వేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి కెమేరామన్ గంగతో రాంబాబు సినిమా తరువాత పూరి ని చాలా దూరం పెట్టారని వార్తలు వున్నాయి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి డిస్కషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం చేస్తున్న లైగర్ సినిమా తరువాత పూరి బాలీవుడ్ సినిమా ఒకటి చేస్తారని టాక్ వుంది. పవన్ కూడా 2022 మార్చి నాటికి కానీ ఫ్రీ అవ్వరు. అప్పటికి ఏం జరుగుతుందో చూడాలి.

About The Author